
-
జీఏడీ, ట్రాన్స్పోర్ట్, హౌసింగ్ శాఖల స్పెషల్
-
సీఎస్గా వికాస్రాజ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శిగా మహేశ్దత్ ఎక్కా
-
పోస్టింగ్ ఇచ్చిన సర్కారు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్లను సర్కారు బదిలీ చేసింది. వికాస్ రాజ్ను జనరల్ అడ్మినిస్ట్రేషన్ (జీఏడీ), ట్రాన్స్పోర్ట్, హౌసింగ్శాఖలకు స్పెషల్ సీఎస్గా నియమించింది. కేంద్ర ప్రభుత్వంతో కో ఆర్డినేషన్, స్మార్ట్గవర్నెన్స్ బాధ్యతలను ఆయనకు అప్పగించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
పోస్టింగ్కోసం వెయిట్చేస్తున్న బెనహర్మహేశ్దత్ ఎక్కాను జనరల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శిగా నియమించారు. గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీగా ఉన్న ఎ. శరత్కు ఆ శాఖ కమిషనర్గానూ అదనపు బాధ్యతలను అప్పగించారు. స్పోర్ట్స్ డైరెక్టర్గా ఉన్న కొర్రా లక్ష్మికి వేర్హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా, ఆర్ అండ్ బీ జాయింట్సెక్రటరీగా ఉన్న ఎస్. హరీశ్కు రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్) శాఖకు స్పెషల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. హనుమకొండ అడిషనల్కలెక్టర్గా ఉన్న రాధికా గుప్తాను మేడ్చల్మల్కాజిగిరి (లోకల్బాడీస్) అడిషనల్ కలెక్టర్గా బదిలీ చేశారు.
-
ఇరిగేషన్శాఖలో బదిలీలకు బ్రేక్
ఇరిగేషన్ శాఖలో ఇంజినీర్ల ట్రాన్స్ఫర్లకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. డిపార్ట్మెంట్లోని అన్ని కేడర్ల ఇంజినీర్ల బదిలీలను తాత్కాలికంగా ఆపుతున్నట్టు ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తి, ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కోసం బదిలీలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు.