రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్​ల బదిలీ

 రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్​ల బదిలీ

 

  • జీఏడీ, ట్రాన్స్​పోర్ట్, హౌసింగ్​ శాఖల స్పెషల్​ 

  • సీఎస్​గా వికాస్​రాజ్ జనరల్​ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శిగా మహేశ్​దత్​ ఎక్కా

  • పోస్టింగ్​ ఇచ్చిన సర్కారు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్​లను సర్కారు బదిలీ చేసింది. వికాస్​ రాజ్​ను జనరల్​ అడ్మినిస్ట్రేషన్ (జీఏడీ)​, ట్రాన్స్​పోర్ట్​, హౌసింగ్​శాఖలకు స్పెషల్​ సీఎస్​గా నియమించింది. కేంద్ర ప్రభుత్వంతో కో ఆర్డినేషన్​, స్మార్ట్​గవర్నెన్స్​ బాధ్యతలను ఆయనకు అప్పగించింది. ఈ మేరకు సీఎస్​ శాంతి  కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 

పోస్టింగ్​కోసం వెయిట్​చేస్తున్న బెనహర్​మహేశ్​దత్​ ఎక్కాను జనరల్​ అడ్మినిస్ట్రేషన్​ కార్యదర్శిగా నియమించారు. గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీగా ఉన్న ఎ. శరత్​కు ఆ శాఖ కమిషనర్​గానూ అదనపు బాధ్యతలను అప్పగించారు. స్పోర్ట్స్​ డైరెక్టర్​గా ఉన్న కొర్రా లక్ష్మికి వేర్​హౌసింగ్​ కార్పొరేషన్​ ఎండీగా, ఆర్​ అండ్​ బీ జాయింట్​సెక్రటరీగా ఉన్న ఎస్. హరీశ్​కు రెవెన్యూ (డిజాస్టర్​ మేనేజ్​మెంట్​) శాఖకు స్పెషల్​ సెక్రటరీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. హనుమకొండ అడిషనల్​కలెక్టర్​గా ఉన్న రాధికా గుప్తాను మేడ్చల్​మల్కాజిగిరి (లోకల్​బాడీస్​) అడిషనల్​ కలెక్టర్​గా బదిలీ చేశారు. 

  • ఇరిగేషన్​శాఖలో బదిలీలకు బ్రేక్​

ఇరిగేషన్​ శాఖలో ఇంజినీర్ల ట్రాన్స్​ఫర్లకు తాత్కాలికంగా బ్రేక్​ పడింది. డిపార్ట్​మెంట్​లోని అన్ని కేడర్ల ఇంజినీర్ల బదిలీలను తాత్కాలికంగా ఆపుతున్నట్టు ఆ శాఖ కార్యదర్శి రాహుల్​ బొజ్జా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తి, ప్రాజెక్టుల ఆపరేషన్​ అండ్​ మెయింటెనెన్స్​కోసం బదిలీలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు.