విజన్- 2047లో తప్పనిసరిగా పాల్గొనాల్సిందే.. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎస్ ఆదేశాలు

విజన్- 2047లో  తప్పనిసరిగా పాల్గొనాల్సిందే.. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎస్ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: 'తెలంగాణ రైజింగ్ విజన్-2047' డాక్యుమెంట్ తయారీలో ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా పాల్గొనాలని సీఎస్​ రామకృష్ణారావు  ఆదేశాలు జారీ చేశారు. తమ విలువైన సలహాలు, సూచనలు ఇవ్వడం ద్వారా విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగస్వాములు కావాలని కోరుతూ మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు.

 ‘‘ఈ నెల 10న సిటిజన్ సర్వే ప్రారంభమైంది. రాష్ట్రంలోని ఉద్యోగులందరూ ఈ నెల 25 వరకు జరిగే  విజన్- 2047 సర్వేలో పాల్గొనాలి. అలాగే, ఉద్యోగులు తమ కార్యాలయాల్లో సర్వే లింక్ (http://www.telangana.gov.in/telanganarising/) ను, క్యూఆర్ కోడ్‌‌ను ప్రదర్శించి.. సర్వేకు విస్తృత ప్రచారం నిర్వహించాలి” అని సీఎస్​ పేర్కొన్నారు.