హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విధానంపై సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానంతో పాటు సిలబస్ను ప్రభుత్వం ప్రకటించింది. గ్రూప్-1లో 19 రకాల పోస్టులు, గ్రూప్-2లో 16 రకాల పోస్టులకు నియామక ప్రక్రియను చేపట్టనున్నారు. గ్రూప్-1 పోస్టులకు 900 మార్కులతో, గ్రూప్-2 పోస్టులకు 600 మార్కులకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించిన ఇంటర్వ్యూలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక గ్రూప్-3లో 8 రకాల పోస్టులకు 450 మార్కులకు రాత పరీక్ష, గ్రూప్-4లో జూనియర్ అసెస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరిన్ని వార్తల కోసం...