మేడారం జాతరకు ప్రభుత్వం భారీగా నిధులు రిలీజ్

మేడారం జాతరకు ప్రభుత్వం భారీగా నిధులు రిలీజ్

దేశంలోనే అతిపెద్ద రెండో జాతర అయిన మేడారం (సమ్మక్క సారలమ్మ) జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. ఈ జాతరకు కోట్లాది మంది భక్తులు హాజరవుతుంటారు. గిరిజనులతో పాటు గిరిజనేతరులు భారీ సంఖ్యలో  జాతరకు హాజరవుతారు. ఎంతో భక్తితో అమ్మవార్లను కొలుచుకుని...మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో జాతరను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. జాతర నిర్వహణ కోసం రూ. 75 కోట్ల నిధులను విడుదల చేసింది.

ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ కు మంత్రి సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు.  మేడారం జాతరకు వచ్చే భక్తులు దుస్తులు మార్చుకునేందుకు గదులు, కమ్యూనిటీ డైనింగ్ హాలు, ఓహెచ్ఆర్ఎస్ నిర్మాణ పనులకు రూ. 2.24 కోట్ల వ్యయంతో గత వారమే శంకుస్థాపన చేశామని చెప్పారు. మిగిలిన పనులన్నింటినీ డిసెంబర్ చివరిలోగా పూర్తి చేస్తామని తెలిపారు.