399 పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు పెట్టినం.. హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్

399 పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు పెట్టినం.. హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్
  • హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని 774 పోలీస్ స్టేషన్లకుగాను 399 స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. మరో 103 స్టేషన్లలో కెమెరాల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది. ఈ వ్యవహారాన్ని సుప్రీం కోర్టు విచారణ చేస్తోందని, ఈ నెల 28న విచారణ జరగనుందని చెప్పింది. 

ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదిక అందజేసినట్లు కూడా ప్రభుత్వ న్యాయవాది తెలియజేశారు. ఈ వివరాలను నమోదు చేసుకున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్.. పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు అంశంపై జరుగుతున్న సుమోటో విచారణను ముగిస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది.