పౌల్ట్రీ పరిశ్రమకు అండగా ప్రభుత్వం... ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి

పౌల్ట్రీ పరిశ్రమకు అండగా ప్రభుత్వం... ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
  • పెద్దఅంబర్ పేట​లో పౌల్ట్రీ ఫెడరేషన్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ​ప్రారంభం 

అబ్దుల్లాపూర్​మెట్, వెలుగు: పౌల్ట్రీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి అన్నారు. పెద్ద అంబర్ పేట​లో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అడ్మినిస్ట్రేషన్ నూతన భవనాన్ని ఆదివారం రోడ్​డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్​ మల్​రెడ్డి రాంరెడ్డితో కలిసి ప్రారంభించారు. పౌల్ట్రీ పరిశ్రమ పితామహుడు బీవీ.రావు సేవలు మరువలేనివన్నారు. 

పౌల్ట్రీ రైతులకు విద్యుత్ సబ్సిడీ, హెచ్​ఎండీఏ పరిధిలో నిర్మించే షెడ్లకు పర్మిషన్​అంశాలపై సీఎం రేవంత్​రెడ్డితో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్​రాష్ట్ర అధ్యక్షుడు కాసర్ల మోహన్​రెడ్డి, ప్రధాన కార్యదర్శి జక్క సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్​చిలుక మధుసూదన్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.