హైదరాబాద్, వెలుగు: నిధుల దుర్వినియోగం, అవినీతి, అసమర్థతకు కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇరి గేషన్ శ్వేతపత్రంపై కూనంనేని మాట్లాడా రు. కాగ్ విడుదల చేసే ఏ నివేదిక అయినా పూర్తి విశ్వసనీ యత ఉంటుందని భావి స్తున్నానని, అందులో తెలిపిన అంశాలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే విలువ ఉం డదన్నారు.
కాగ్ను ఆట బొమ్మ లా భావిస్తూ మాట్లాడటం సరికాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలపై కాగ్ నివేదికలోని అంశాలపై బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడిన తీరు.. పరీక్షల్లో మార్కులు రాకపోతే చిన్నపిల్లలు ఇచ్చే సంజాయిషీ మాదిరిగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.