తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు చెందిన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు.
తాను చేసిన 10 ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని గవర్నర్ తెలిపారు. దాదాపు నెల రోజుల తర్వాత బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.
Also Read : 24 గంటల దీక్షను విరమించిన కిషన్ రెడ్డి
ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ కార్మికులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.