నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్. బీబీ నగర్ ఎయిమ్స్కు గవర్నర్ చేరుకున్నారు. బీబీనగర్ పట్టణ సమీపంలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్)కు శనివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సందర్శించారు. ఈ సందర్భంగాా ఎయిమ్స్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎయిమ్స్లో నిర్వహించే 2021-22 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థుల వైట్ కోట్ వేడుకల్లో గవర్నర్ పాల్గొననున్నారు. ఉదయం 8.45 గంటలకు రోడ్డు మార్గంలో బయల్దేరి ఎయిమ్స్కు చేరుకున్నారు తమిళిసై 10.45గంటల నిర్వహించే వైట్కోట్ వేడుకల్లో ప్రసంగిస్తారు
ఇవి కూడా చదవండి:
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్డేట్స్