హైదరాబాద్, వెలుగు: జాయింట్చెక్పవర్ఉన్నా చెక్కులపై సంతకాలు పెట్టకుండా సర్పంచ్లను ఇబ్బందులకు గురిచేస్తున్న ఉపసర్పంచ్లపై వేటు పడుతోంది. ఎలాంటి కారణాలు లేకుండా ఉద్దేశపూర్వకంగా చెక్కులపై సంతకం చేయని ఉపసర్పంచ్లపై ఫిర్యాదు అందితే అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో ఓ ఉపసర్పంచ్పై పంచాయతీరాజ్ చట్టం–2018 సెక్షన్ 37(5) ప్రకారం ఆరు నెలలపాటు ఆ జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు.
జాయింట్ చెక్పవర్ తో తంటా..
గతంలో గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఉండేది. కొత్త పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం సర్పంచ్, ఉపసర్పంచ్కు మాత్రమే జాయింట్ చెక్పవర్ కల్పించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సర్పంచ్లు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా 30 రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టింది. ఈ సందర్భంగా లక్షలాది రూపాయలు అప్పులు చేసి సర్పంచ్లు పనులు చేపట్టారు. బిల్లులు పొందే విషయంలో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిల్లులకు సంబంధించిన చెక్కులపై సంతకం చేయడానికి ఉప సర్పంచ్లు ఇబ్బందులు పెడుతుండటంతో తలలు పట్టుకుంటున్నారు. దీనిపై కొందరు సర్పంచ్లు పంచాయతీరాజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

