తెలంగాణ పిటిషన్పై హోలీ తర్వాతే విచారణ : సుప్రీం కోర్టు

తెలంగాణ పిటిషన్పై హోలీ తర్వాతే విచారణ : సుప్రీం కోర్టు

గవర్నర్ తమిళిసైపై తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టులో హోలీ పండుగ తర్వాత విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీ నుండి 11 వరకు సుప్రీంకోర్టుకు హోలీ సెలవులు ప్రకటించారు. హోలీ సెలవుల తరువాతే తిరిగి సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. దీంతో మరో వారం రోజుల తరువాతే తెలంగాణ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

గవర్నర్​ తమిళిసైపై రాష్ట్ర సర్కార్​ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను ఆమె అడ్డుకుంటున్నారని, వాటిని ఆమోదించడం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరిట గురువారం  194 పేజీల పిటిషన్ దాఖలైంది. గవర్నర్​ సెక్రటరీ, కేంద్ర లా సెక్రటరీని ప్రతివాదులుగా చేర్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 32 ప్రకారం పిటిషన్​ను ఫైల్​ చేస్తున్నట్లు తెలిపింది. ‘‘ఆర్టికల్​ 200 ప్రకారం గవర్నర్​ స్వతంత్రంగా వ్యవహరించడానికి వీల్లేదు. ఆర్టికల్​163 ప్రకారం సీఎం నేతృత్వంలోని మంత్రి మండలి, రాష్ట్ర సర్కారు సలహాలు, సూచనలకు లోబడే గవర్నర్​ పనిచేయాల్సి ఉంటుంది’’ అని పిటిషన్​లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.