
రైతు భరోసా నిధులను సకాలంలో విడుదల చేసి రైతులకు అండగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. కేవలం 9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లను ప్రభుత్వం జమ చేసిందన్నారు.
సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, నియోజకవర్గ ఎమ్మెల్యేల ఫొటోలకు క్షీరాభిషేకాలు చేశారు. ఖానాపూర్లో ఎన్టీఆర్ విగ్రహం నుంచి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. – నెట్వర్క్, వెలుగు