
హైదరాబాద్, వెలుగు: గత నెలలో జరిగిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు సోమవా రం రిలీజ్ కానున్నాయి. గత నెల 22 నుంచి 29 వరకు పరీక్షలు జరగగా.. 4.13 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాలను సోమవారం మధ్యాహ్నం12గంటలకు రిలీజ్ చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. విద్యార్థులు, పేరెంట్స్ http://results.cgg.gov.in, https://tgbie.cag.gov.in వెబ్ సైట్ల ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని అధికారులు ప్రకటించారు.