భారతదేశంలో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. గతంలో కంటే తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 2000లోపు పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. ఓ వైపు కేసులు నమోదవుతున్నా.. వ్యాక్సినేషన్ ప్రక్రయ జోరుగా కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో కూడా తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే.. ప్రపంచదేశాల్లోని ఇతర దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. గత 24 గంటల్లో 38కేసులు నమోదయినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. సోమవారం ఈ కేసుల సంఖ్య 28గా ఉందనే సంగతి తెలిసిందే. 42 మంది ఆరోగ్యవంతులయ్యారని.. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 7, 88, 184 మంది కోలుకున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4 వేల 111గా ఉందని తెలిపింది. రికవరీ రేటు 99.43 శాతంగా ఉందని, మొత్తం 13 వేల 930 టెస్టులు నిర్వహించడం జరిగిందని పేర్కొంది.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు :
ఆదిలాబాద్ 01, భద్రాద్రి కొత్తగూడెం 01, హైదరాబాద్ లో 27, జగిత్యాల 00, జనగాం 00, జయశంకర్ భూపాలపల్లి 00, జోగులాంబ గద్వాల 00, కామారెడ్డి 00, కరీంనగర్ 00, ఖమ్మం 00, కొమరంభీం ఆసిఫాబాద్ 00, మహబూబ్ నగర్ 00, మహబూబాబాద్ 01, మంచిర్యాల 01, మెదక్ 00, మేడ్చల్ మల్కాజ్ గిరి 01, ములుగు 00, నాగర్ కర్నూలు 00, నల్గొండ 00, నారాయణపేట 00, నిర్మల్ 00, నిజామాబాద్ 00, పెద్దపల్లి 00, రాజన్న సిరిసిల్ల 00, రంగారెడ్డి 04, సంగారెడ్డి 01, సిద్ధిపేట 00, సూర్యాపేట 01, వికారాబాద్ 00, వనపర్తి 00, వరంగల్ రూరల్ 00, హన్మకొండ 00, యాదాద్రి భువనగరి 00. మొత్తం - 38
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
— IPRDepartment (@IPRTelangana) May 17, 2022
(Dated.17.05.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/RNVMscyKkO
మరిన్ని వార్తల కోసం : -
10రోజుల పాటు కేటీఆర్ విదేశీ టూర్