
హైదరాబాద్, వెలుగు: సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డ్ మెంబర్లుగా అల్లంశెట్టి హరిత (హరిప్రియ), ఏ.వంశీ ప్రియ అపాయింట్ అయ్యారు. ఈ నియామకాల్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ చేపట్టింది. వీరిద్దరూ రెండేండ్లపాటు సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డ్ సభ్యులుగా కొనసాగనున్నారు. నియామకానికి సహకరించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ కు హరిప్రియ, వంశీప్రియ థ్యాంక్స్ చెప్పారు.