
- మనపై చాలా ఎక్స్పెక్టేషన్స్పెట్టుకున్నరు
- దేశంలోనే ఫస్ట్ప్లేస్ రావడంతో అంచనాలు పెరిగాయి
- వికారాబాద్లో డీజీపీ జితేందర్
వికారాబాద్, వెలుగు: దేశంలోనే తెలంగాణ పోలీస్శాఖకు ఫస్ట్ ప్లేస్ వచ్చిందని, దీంతో ప్రజల్లో పోలీసులపై ఎక్స్పెక్టేషన్స్పెరిగాయని, పోలీసులు మరింత కష్టపడి పని చేసి ఆ పేరు నిలబెట్టుకోవాలని డీజీపీ డాక్టర్జితేందర్అన్నారు. మంగళవారం వికారాబాద్జిల్లా ఎస్పీ ఆఫీసులో మాట్లాడుతూ జిల్లాల పర్యటనలో భాగంగా వికారాబాద్వచ్చానని, త్వరలో మిగిలిన జిల్లాల్లో కూడా పర్యటన ఉంటుందన్నారు. ప్రజలంతా డయల్100ను ఉపయోగించుకోవాలన్నారు.
నకిలీ విత్తనాల పని పట్టేందుకు అగ్రికల్చర్ఆఫీసర్ల కోఆర్డినేషన్తో ప్రతి జిల్లాలో స్పెషల్పోలీస్టీమ్స్ఏర్పాటు చేశామన్నారు. గత ఏడాది 30 వేల కిలోల గంజాయి సీజ్చేశామని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో సైబర్ క్రైం తగ్గిందన్నారు. సైబర్ నేరాల నివారణకు 200 మంది వరకు పని చేస్తున్నారని, రాష్ట్రంలో తొమ్మిది సైబర్ క్రైం పీఎస్లు ఏర్పాటు చేశామన్నారు.
మల్టీ జోన్2 ఐజీ సత్యనారాయణ, చార్మినార్జోన్డీఐజీ తఫ్సీర్ఇక్బాల్, వికారాబాద్ఎస్పీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.