దేశంలో ఫస్ట్ ప్లేస్ సాధించిన తెలంగాణ పోలీస్ శాఖ: వికారాబాద్లో డీజీపీ జితేందర్

దేశంలో ఫస్ట్ ప్లేస్ సాధించిన  తెలంగాణ పోలీస్ శాఖ: వికారాబాద్లో డీజీపీ జితేందర్
  • మనపై చాలా ఎక్స్​పెక్టేషన్స్​పెట్టుకున్నరు
  • దేశంలోనే ఫస్ట్​ప్లేస్ రావడం​తో  అంచనాలు పెరిగాయి 
  • వికారాబాద్​లో డీజీపీ జితేందర్​  

వికారాబాద్, వెలుగు: దేశంలోనే తెలంగాణ పోలీస్​శాఖకు ఫస్ట్​ ప్లేస్​ వచ్చిందని, దీంతో ప్రజల్లో పోలీసులపై ఎక్స్​పెక్టేషన్స్​పెరిగాయని, పోలీసులు మరింత కష్టపడి పని చేసి ఆ పేరు నిలబెట్టుకోవాలని డీజీపీ డాక్టర్​జితేందర్​అన్నారు. మంగళవారం వికారాబాద్​జిల్లా ఎస్​పీ ఆఫీసులో మాట్లాడుతూ జిల్లాల పర్యటనలో భాగంగా వికారాబాద్​వచ్చానని, త్వరలో మిగిలిన జిల్లాల్లో కూడా పర్యటన ఉంటుందన్నారు. ప్రజలంతా డయల్​100ను ఉపయోగించుకోవాలన్నారు. 

నకిలీ విత్తనాల పని పట్టేందుకు అగ్రికల్చర్​ఆఫీసర్ల కోఆర్డినేషన్​తో ప్రతి జిల్లాలో స్పెషల్​పోలీస్​టీమ్స్​ఏర్పాటు చేశామన్నారు. గత ఏడాది 30 వేల కిలోల గంజాయి సీజ్​చేశామని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో సైబర్​ క్రైం తగ్గిందన్నారు. సైబర్​ నేరాల నివారణకు 200 మంది వరకు పని చేస్తున్నారని, రాష్ట్రంలో తొమ్మిది సైబర్​ క్రైం పీఎస్​లు ఏర్పాటు చేశామన్నారు. 

మల్టీ జోన్​2 ఐజీ సత్యనారాయణ, చార్మినార్​జోన్​డీఐజీ తఫ్సీర్​ఇక్బాల్​, వికారాబాద్​ఎస్​పీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు పోలీస్​ అధికారులతో సమీక్ష నిర్వహించారు.