
- వెరీ ఫాస్ట్ యాప్ కు దక్కిన బెస్ట్ సర్వీస్ అవార్డు
న్యూఢిల్లీ, వెలుగు: పాస్ పోర్ట్ అప్లికేషన్ వెరిఫికేషన్ లో దేశంలోనే తెలంగాణ పోలీసులు నంబర్ వన్ గా నిలిచారు. రాష్ట్ర పోలీసులు రూపొందించిన ‘వెరీ ఫాస్ట్’ యాప్ కు బెస్ట్ సర్వీస్ అవార్డు దక్కింది. మంగళవారం పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర మంత్రి పబిత్రా మార్గరిటా చేతుల మీదుగా ఉత్తమ సేవా ధ్రువీకరణ పత్రాన్ని ఇంటలిజెన్స్ చీఫ్ బి.శివధర్ రెడ్డి అందుకున్నారు. కాగా.. వెరీ ఫాస్ట్ యాప్ వెరిఫికేషన్ వేగంగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు ఎంతగానో దోహదపడుతోంది.
దీని సహాయంతో కేవలం మూడు రోజుల్లో పాస్ పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను పోలీసులు పూర్తి చేస్తున్నారు. ఈ యాప్ తో ఇంటెలిజెన్స్ డేటాబేస్తో పాత నేరస్థులను గుర్తించడం, ఎస్ఎంఎస్ అలర్ట్స్ తో దరఖాస్తు దారులకు తక్షణ సమాచారం, డేటా అనలిటిక్స్, పారదర్శకతతో ర్యాండమ్ అధికారుల నియామకం, అవినీతికి అడ్డుకట్ట వంటి చర్యలు చేపట్టింది.