తెలంగాణలో మూడు రోజులు వైన్ షాపులు, బార్లు క్లోజ్

తెలంగాణలో మూడు రోజులు వైన్ షాపులు, బార్లు క్లోజ్

తెలంగాణ రాష్ట్రం మొత్తం.. మూడు రోజులు మద్యం షాపులు మూతపడనున్నాయి. 2023 నవంబర్ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రం మొత్తం వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీనికి కారణం లేకపోలేదు. తెలంగాణలో నవంబర్ 30వ తేదీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 

ఈ క్రమంలోనే 28, 29, 30వ తేదీల్లో.. మూడు రోజులు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశించింది ఎలక్షన్ కమిషన్. ఈ మేరకు లైసెన్స్ దారులకు స్పష్టం చేసింది.  ఓటర్లను ప్రభావితం చేయకుండా చూసేందుకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.  ఎవరైనా వీటిని ఊల్లఘింస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.  

తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.  నవంబర్ 3న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో  119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. పలువురు అభ్యర్థలు నామినేషన్లు ధాఖలు చేస్తున్నారు. నవంబర్ 10 వరకు రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. ఈనెల13న నామినేషన్ల పరిశీలన చేపట్టనుండగా.. 15వ తేదీ విత్‌‌డ్రాకు చివరి తేదీగా నిర్ణయించారు.

ALSO READ :- తంగలాన్.. విక్రమ్ డైలాగ్స్ స్టేట్మెంట్పై..క్లారిటీ ఇచ్చిన తన మేనేజర్