జీపీఎఫ్ కోసం రూరల్ ఎమ్మెల్యేకు వినతి

జీపీఎఫ్ కోసం రూరల్ ఎమ్మెల్యేకు వినతి

నిజామాబాద్, వెలుగు : ఎన్​పీడీసీఎల్​లో 1999 నుంచి 2004 వరకు అపాయింట్ అయిన ఇంజినీర్లు, ఉద్యోగులను ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్​కు మార్చాలని తెలంగాణ పవర్​ ఎంప్లాయీస్​ జేఏసీ నాయకులు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిశారు. మంగళవారం ఆయన క్యాంప్​ వెళ్లి వినతి పత్రం అందించారు.

 కరెంట్ శాఖలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం రూ.కోటి విలువ ప్రమాద బీమా వసతి కల్పించడంపై జేఏసీ చైర్మన్ రఘునందన్​ కృతజ్ఞతలు తెలిపారు. కన్వీనర్ బాలేశ్​కుమార్, కో కన్వీనర్ తోట రాజశేఖర్ తదితరులు ఉన్నారు.