
నిజామాబాద్, వెలుగు : ఎన్పీడీసీఎల్లో 1999 నుంచి 2004 వరకు అపాయింట్ అయిన ఇంజినీర్లు, ఉద్యోగులను ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్కు మార్చాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిశారు. మంగళవారం ఆయన క్యాంప్ వెళ్లి వినతి పత్రం అందించారు.
కరెంట్ శాఖలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం రూ.కోటి విలువ ప్రమాద బీమా వసతి కల్పించడంపై జేఏసీ చైర్మన్ రఘునందన్ కృతజ్ఞతలు తెలిపారు. కన్వీనర్ బాలేశ్కుమార్, కో కన్వీనర్ తోట రాజశేఖర్ తదితరులు ఉన్నారు.