- రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్ర, సాంకేతిక పరిణామాలను ప్రతిబింబించేలా హైదరాబాద్లో మ్యూజియం లేదా శాశ్వత ప్రదర్శన కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున సూచించారు. విద్యుత్ రంగంపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేందుకు, సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న యువతకు ప్రత్యక్ష అనుభవాన్ని అందించేందుకు పవర్ ఎగ్జిబిషన్ వంటి ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
సదరన్ డిస్కమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తున్న పవర్ ఎగ్జిబిషన్–2026ను సోమవారం ఆయనతో పాటు ఈఆర్సీ సభ్యులు కంచర్ల రఘు, చెరుకూరి శ్రీనివాసరావు సందర్శించారు. విద్యుత్ రంగ చరిత్ర, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా అంశాలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థపై విద్యార్థులు, యువత, సాధారణ ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించే విధంగా ఈ ప్రదర్శనను రూపొందించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర రాజధానికే పరిమితం కాకుండా జిల్లా కేంద్రాల్లో కూడా ఇలాంటి పవర్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తే మరింత మంది ప్రయోజనం పొందగలరని అభిప్రాయపడ్డారు. ఆయన వెంట జితేశ్ పాటిల్, శివాజీ, కృష్ణారెడ్డి, నరసింహులు ఉన్నారు.
పవర్ ఎగ్జిబిషన్ను సందర్శించిన కవిత
సదరన్ డిస్కమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పవర్ ఎగ్జిబిషన్–2026ను టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వేర్వేరుగా సందర్శించారు.
