
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్ కొత్త లోగోను ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో ఉన్న లోగోలో 2047ను యాడ్ చేసింది. లోగో కింది భాగంలో తెలంగాణ రైజింగ్ 2047 అని రాసి ఉంది. అంతేకాకుండా లోగోలోని నంబర్ 1 అంకె మధ్యలో తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉదయిస్తున్న సూర్యుడి గుర్తును ఏర్పాటు చేశారు. దేశంలోనే తెలంగాణ నంబర్ 1గా ఎదుగుతుందనే విషయాన్ని తెలిపేలా లోగోలో నంబర్ వన్ ఏర్పాటు చేశారు. దాని మధ్యలో ఓ గుండ్రటి చక్రంలో తెలంగాణ మ్యాప్ ఉండేలా తయారు చేశారు.