హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించిన మంత్రి వేముల…

హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించిన మంత్రి వేముల…

రాష్ట్ర ఆర్&బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం మెట్రోరైలులో ప్రయాణించారు… ప్రయాణికులను మెట్రోసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. (ఇరం మంజిల్) ఎర్ర మంజిల్  నుంచి ఎల్బీనగర్ వరకు ప్రయాణించిన ఆయన.. బంధువుల ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ కు అటెండ్ అవుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లో మెట్రో వచ్చినప్పటినుంచి ట్రేైన్ లో ప్రయాణించే వీలుకాలేదని అన్నారు. ప్రయాణికులను మెట్రోగురించి అభిప్రాయాలు తెలుసుకోగా… సమయం ఆదా అవుతుందని, కంఫర్ట్ గా ప్రయాణం చేస్తున్నామని చెప్పారు.

మెట్రో ప్రయాణం సంతృప్తినిచ్చిందని మీడియాకు తెలిపారు మంత్రి వేముల. వారితో పాటు ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ కంట్రోలర్ సుప్రియ కూడా  ప్రయాణించారు. సుప్రియ మాట్లాడుతూ.. గతంలో కంటే ఇప్పుడు మెట్రో లో ప్రయాణం చేసే వారి సంఖ్య పెరిగిందని..  ప్రతి రోజు 3,70,000 వరకు ప్రజలు మెట్రోలో ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం మూడు బోగీలు ఉన్నాయని అయితే ఆరు బోగీల వరకు పెంచుకోవచ్చని తెలిపారు.