రాష్ట్రంలో కొత్తగా 1825 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 1825 కరోనా కేసులు

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఆదివారంతో పోలిస్తే వైరస్ బారిన పడిన వారి సంఖ్య స్వల్పంగా పెరిగింది. నిన్న 1,673 కరోనా కేసులు రాగా.. ఈ రోజు 1825 మంది మహమ్మారి బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 351 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.58శాతం కాగా.. రికవరీ రేటు 97.26శాతంగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 14,995 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

మరిన్ని వార్తల కోసం..

సంక్రాంతికి అదనంగా  200 స్పెషల్ రైళ్లు

కాంగ్రెస్లో చేరిన సోనూసూద్ సోదరి