టీచర్లకు ట్రైనింగ్ కంప్లీట్

టీచర్లకు ట్రైనింగ్ కంప్లీట్
  •  మొత్తం 1.12 లక్షల మందికి శిక్షణ 

హైదరాబాద్, వెలుగు: హై రాష్ట్రంలో సర్కార్ స్కూల్ టీచర్లకు స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్సీఈఆర్టీ అధికారులు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ముగిసింది. మే 13 నుంచి 31 వరకు మూడు విడుతల్లో ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 25,356  సర్కార్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, సొసైటీ గురుకులాల్లో మొత్తం 1,22,854 మంది టీచర్లు ఉండగా.. వారిలో 1,12,882 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. మొదటి విడతలో మే 13 నుంచి 17 వరకు 18,448 మందికి, రెండో విడతలో 20 నుంచి 24 వరకు 76,256 మందికి, మూడో విడతలో 27 నుంచి 31 వరకు 18,178 మందికి ట్రైనింగ్ ఇచ్చినట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి  తెలిపారు. సెలవులు, మెడికల్ లీవ్స్ కారణంగా కొందరు రాలేకపోయారని.. మరో 3,202 మందికి త్వరలోనే ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. 

5,605 మంది రిసోర్స్ పర్సన్స్ ఈ శిక్షణ ఇచ్చారని వెల్లడించారు. స్కూళ్ల బలోపేతానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు టీచర్లకు ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీతో పాటు ఆరు నుంచి 9వ తరగతి వరకు టీచర్లకు లెర్నింగ్ ఇంప్రూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, కొత్త బోధనా పద్ధతులు, వాల్యుయేషన్ ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు. దీంతో పాటు టీచర్లందరికీ ఏఐ, డిజిటల్ సాక్షరత, డ్రగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ -ఫ్రీ స్కూల్స్, కిశోర భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కాగా, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీటీలకు మండల స్థాయిలో, స్కూల్ అసిస్టెంట్లకు జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వగా.. వారందరికీ యాప్ ద్వారా అటెండెన్స్ తీసుకోవడంతో పాటు సర్టిఫికెట్లూ అందించారు.