జాతీయ నేతలకు తెలంగాణ రుచులు

జాతీయ నేతలకు తెలంగాణ రుచులు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు బీజేపీ దిగ్గజాలు తెలంగాణ వంటకాల రుచి చూడబోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి గుడాటిపల్లెకి చెందిన యాదమ్మ చేతితో చేసిన వంటకాలను ప్రముఖులంతా టేస్ట్ చేయబోతున్నారు. భోజనంతోపాటు స్నాక్స్ కూడా తెలంగాణ స్టెయిల్లోనే తయారు చేస్తున్నారు. స్వీట్స్ కూడా తెలంగాణ తినుబండారాలనే వడ్డించనున్నారు.దాదాపు 50 రకాల వంటకాలను బీజేపీ అతిరథ మహారథుల కోసం సిద్ధం చేస్తున్నారు. 

మెనూ ఇదే..

కూరలు...

 చిక్కుడుకాయ టమోటా,  ఆలు కూర్మ,  వంకాయ మసాల,  దొండకాయ,  పచ్చికొబ్బరి తురుము  ఫ్రై, బెండకాయ , కాజు పల్లీల ఫ్రై,  తోటకూర టమోటా ఫ్రై,  బీరకాయ , మిల్ మేకర్ చూర ఫ్రై, మెంతికూర పెసరపప్పు ఫ్రై, 

గంగవాయిలకూర,  మామిడికాయ పప్పు,  సాంబారు, ముద్దపప్పు, పచ్చిపులుసు, గోంగూర పచ్చిడి,  దోసకాయ ఆవ చట్నీ,  టమోటా చట్నీ, సొరకాయ చట్నీ, టమోటా చట్నీ, పల్లీ చట్నీ, పచ్చి కొబ్బరి చట్నీ,  మిర్చి.

ఫుడ్

 బగార, పులిహోర, పుదీన రైస్, వైట్ రైస్, పెరుగన్నం. 


స్వీట్స్

 బెల్లం పరమాన్నం,  సేమియా పాయసం,  భక్షాలు, బూరెలు,  అరిసెలు.

 
స్నాక్స్... 


పెసరపప్పు గారెలు,  సకినాలు, మక్క గుడాలు,  సర్వపిండి.