CJI NV రమణకు ఘన స్వాగతం 

CJI NV రమణకు ఘన స్వాగతం 

సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన.. జస్టిస్ NV రమణకు ఘనస్వాగతం లభించింది.హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో రాష్ట్ర మంత్రులు, హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, డీజీపీ మహేందర్ రెడ్డి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ.. ఎయిర్ పోర్టుకు వెళ్లారు. తర్వాత నేరుగా రాజ్ భవన్ కు చేరుకోనున్నారు సీజేఐ ఎన్వీ రమణ. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్.. సీజేఐ ఎన్వీ రమణకు స్వాగతం పలకనున్నారు. ఇందుకోసం ఇప్పటికే రాజ్ భవన్ కు చేరుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మూడ్రోజుల పాటు రాష్ట్రంలో ఉండనున్నారు సీజేఐ NV రమణ.