హైదరాబాద్, వెలుగు: రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చే నెల 26న ఢిల్లీలోని రాజ్పథ్లో జరిగే పరేడ్కు రాష్ట్ర శకటం ఎంపికైంది. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను ప్రతిబింబించే ఈ శకటంపై వేయి స్తంభాల గుడి, బతుకమ్మ వైభవం కూడా కొలువుదీరనున్నాయి. పరేడ్లో మేడారం జాతర రూపకాన్ని కళాకారులు ప్రదర్శించనున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రాజ్పథ్ పరేడ్కు రాష్ట్ర శకటం ఎంపిక కావడం ఇది రెండోసారి. 2015లో తొలిసారి అవకాశం దక్కింది. అటు తర్వాత బతుకమ్మ, మేడారం జాతర ఆకృతితో శకటాల నమూనాలు పంపించినప్పటికీ ఎంపిక కాలేదు. ఈసారి శకటం సెలెక్ట్ కావడంపై హర్షం వ్యక్తమవుతోంది. శకటం నమూనాను ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ గురువారం మీడియాకు విడుదల చేశారు. సెలక్షన్ కమిటీ నుంచి అఫీషియల్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.