కరోనా పై తొ‌లి విజయం సాధించేది తె‌లంగాణనే

కరోనా పై తొ‌లి విజయం సాధించేది తె‌లంగాణనే

కరోనా పై యుద్ధంలో తెలంగాణనే మొదట విజయం సాధిస్తుందని రాష్ట్ర‌ మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలో టీఆర్ఎస్ యువనేత సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన పేదలకు నిత్యవసర సరకుల పంపిణీలో మంత్రులు మల్లారెడ్డి, తలసాని , టీఆర్ఎస్ ఢిల్లీ అధికార ప్రతినిధి వేణుగోపాల చారీలు ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ…వలస కార్మికులను, పేద ప్రజలను తెలంగాణ ప్రభుత్వం అనేక విధాలుగా అండగా ఉండి ఆదుకుంటుందని తెలిపారు. ఇదంతా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం వలననే సాధ్యమైందని పేర్కొన్నారు.. మల్లారెడ్డి మాట్లాడుతూ కరోనాపై తెలంగాణనే మొదటి విజయం సాధిస్తుందని, కారణం కేసీఆర్ లాంటి నేత ముఖ్యమంత్రిగా ఉండడమే నని అన్నారు.. వేణుగోపాల చారి మాట్లాడుతూ కరెంట్ చార్జీల విషయంలో కేంద్రం ప్రవేశపెట్ట చూస్తున్న కొత్త విధానాలు తెలంగాణ ప్రభుత్వం పైన పెనుభారంగా మారుతుందని, పూర్తిగా వ్యతిరేకిస్తామని తెలిపారు.

Telangana state will get first victory over Corona says ministers