తెలంగాణ త్యాగధనులకు వందనం

తెలంగాణ త్యాగధనులకు వందనం

వైభవ్‌‌‌‌ సూర్య, రామకృష్ణ, విజయ్‌‌‌‌, లోహిత్‌‌‌‌  ముఖ్యపాత్రల్లో నాగబాల సురేష్‌‌‌‌కుమార్‌‌‌‌ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ ‘తెలంగాణ త్యాగధనులు’. వి. విజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌ నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌‌‌‌ ఓపెనింగ్, ఆడియో లాంచ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్‌‌‌‌లో జరిగింది. ఎఫ్‌‌‌‌డీసీ చైర్మన్‌‌‌‌ అనిల్‌‌‌‌ కూర్మాచలం క్లాప్‌‌‌‌ కొట్టి ప్రారంభించారు. ‘వందనం వందనం తెలంగాణ త్యాగధనులకు ఇదే వందనం’ అనే పాటను నటి రోజా రమణి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనుల్లో కొందరి జీవితాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌‌‌‌ తెరకెక్కిస్తున్నాం. తెలంగాణ చరిత్ర చాలా పెద్దది కనుక దీన్ని ఎన్ని సీజన్స్‌‌‌‌గా తీస్తామనేది ఇప్పుడే చెప్పలేం. 

జాతీయ స్థాయిలో మన చరిత్ర తెలిసేలా రూపొందిస్తాం’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘చరిత్రలో నిలిచిపోయే కథలను, అందరికీ గుర్తుండిపోయేలా, లాభాపేక్ష లేకుండా నిర్మిస్తున్నాం’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఖద్దూస్‌‌‌‌, వెనిగళ్ల రాంబాబు, దర్శకులు రేలంగి నరసింహారావు, నిర్మాత రాజ్ కందుకూరి, వకుళా భరణం కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.