
హైదరాబాద్, వెలుగు: యూఎస్ కంపెనీ కోర్నింగ్ రాష్ట్రంలో భారీగా ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది. స్మార్ట్ఫోన్ల కోసం గొరిల్లా గ్లాస్లను తయారు చేయడానికి మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ను కంపెనీ పెట్టనుందని రాష్ట్ర ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. రూ. 934 కోట్లను ఇన్వెస్ట్ చేయనుందని, సుమారు 800 మందికి ఉద్యోగాలు ఇవ్వనుందని వివరించారు. స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ల తయారీలో ఇదొక స్ట్రాటకిజక్ ఇన్వెస్ట్మెంట్ అని కేటీఆర్ అన్నారు. కోర్నింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ బేన్, గ్లోబల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ రవికుమార్తో సమావేశం బాగా జరిగిందని పేర్కొంటూ, మీటింగ్కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.
నోయిడాలో జాయింట్ వెంచర్ కూడా..
గొరిల్లా గ్లాస్లను తయారు చేయడానికి ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్, కార్నింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఓ జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేశాయి. ఈ జాయింట్ వెంచర్లో ఆప్టిమస్కు 70 శాతం వాటా ఉంటుంది. నోయిడాలో ప్లాంట్ పెట్టనున్నామని, వచ్చే ఏడాదిలో ప్రొడక్షన్ స్టార్టవుతుందని ఆప్టిమస్ చైర్మన్ అశోక్ గుప్తా పేర్కొన్నారు. కంపెనీ తయారు చేసే ఫినిష్డ్ గ్లాస్లను స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, ల్యాప్టాప్ స్కీన్లపై వాడతారు.