
హైదరాబాద్: మలేసియాలో జరిగిన లంకావీ యూత్ ఇంటర్నేషనల్ రెగెట్టాలో తెలంగాణ యువ సెయిలర్లు సత్తా చాటారు. ఒక స్వర్ణం, రెండు రజత పతకాలతో మెరిశారు. ఇంటర్నేషనల్ 420 మిక్స్డ్ డబుల్స్ అండర్–19 విభాగంలో తనుజా కామేశ్వర్–శ్రవణ్ కత్రావత్ గోల్డ్ మెడల్ను సాధించారు. ఈ జంట ఆరు రేసుల్లో మూడుసార్లు టాప్ ప్లేస్లో నిలిచారు.
దీక్షిత కొమరవెల్లి–గణేశ్ పీర్కట్లకు సిల్వర్ లభించింది. అండర్–15 అప్టిమిస్టిక్ విభాగంలో లాహిరి కొమరవెల్లి రజతం సొంతం చేసుకుంది. ఒక రేసులో అందరికంటే ముందున్నప్పుడు సిగ్నల్ను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల స్వర్ణం గెలిచే చాన్స్ను కోల్పోయింది. ఈ టోర్నీలో ఇండియా మొత్తం 9 మెడల్స్ సాధించింది.