హైదరాబాద్, వెలుగు : తెలంగాణ యంగ్ అథ్లెట్అగసార నందిని ఆసియా గేమ్స్కు ఎంపికైంది. సెప్టెంబర్ 23 నుంచి చైనాలోని హాంగ్జౌలో జరిగే మెగా ఈవెంట్లో నందిని విమెన్స్ హెప్టాథ్లాన్లో బరిలోకి దిగనుంది. ఆసియా గేమ్స్లో ఇండియా నుంచి ఈసారి రికార్డు స్థాయిలో అథ్లెట్లు పోటీ పడనున్నారు. మొత్తం 634 స్పోర్ట్స్ పర్సన్లతో కూడిన జంబో టీమ్కు సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్ట్రీ శుక్రవారం క్లియరెన్స్ ఇచ్చింది.
2018లో జకార్తాలో జరిగిన గత ఎడిషన్లో అత్యధికంగా 578 మంది పోటీ పడ్డ రికార్డును ఇండియా బ్రేక్ చేయనుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ఏకంగా 850 అథ్లెట్లను రికమెండ్ చేసింది. కానీ, స్పోర్ట్స్ మినిస్ట్రీ మొత్తంగా 38 క్రీడాంశాల్లో 634 మందికే ఆమోదం తెలిపింది. ఇందులో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ల నుంచి అత్యధికంగా 65 మంది అథ్లెట్లు (34 మెన్, 31 విమెన్) బరిలో ఉన్నారు.