బెంగళూరు: ఐటీఎఫ్ విమెన్స్ వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నమెంట్లో తెలంగాణ యంగ్స్టర్ శ్రీవల్లి రష్మిక ఫైనల్ చేరుకుంది. శనివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ సెమీఫైనల్లో రష్మిక 6–1, 6–1తో రెండో సీడ్ లన్లానా టరారుడీ (థాయ్లాండ్)కు వరుస సెట్లలో షాకిచ్చింది.
మరో మ్యాచ్లో జీల్ దేశాయ్ 3–6, 6–4, 7–5తో ఇండియాకే చెందిన మూడో సీడ్ రుతుజా భోసలేపై గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లోజీల్ దేశాయ్, రష్మిక అమీతుమీ తేల్చుకోనున్నారు.