చెన్నై : ప్రో కబడ్డీ లీగ్లో ఐదు ఓటముల తర్వాత బోణీ చేసిన తెలుగు టైటాన్స్ మళ్లీ ఓడింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 31–33తో బెంగళూరు బుల్స్ చేతిలో పరాజయం పాలైంది.
కెప్టెన్ పవన్ సెహ్రావత్ 13 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. బుల్స్ జట్టులో సుర్జీత్ 7, భరత్ 6 పాయింట్లతో సత్తా చాటారు. లీగ్లో ఏడు మ్యాచ్ల్లో టైటాన్స్ కు ఇది ఆరో ఓటమి కావడం గమనార్హం.