గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ ఏడో ఓటమిని ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో టైటాన్స్ 52–34 తేడాతో యు ముంబా చేతిలో ఓడింది. టైటాన్స్ టీమ్లో రజనీష్ (8), రాబిన్ చౌదరీ (7), ప్రఫుల్ (7) మినహా మిగతా వారు విఫలమయ్యారు.
యు ముంబా రైడర్ గుమన్ సింగ్ 10 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. అమిర్మహ్మద్ (8), రింకూ (8), సోంబీర్ (8) అండగా నిలిచారు. తాజా ఓటమితో టైటాన్స్ 8 పాయింట్లతో ఆఖరి ప్లేస్లో కొనసాగుతున్నది. మరో మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ 35–25తో యూపీ యోధాస్ను ఓడించింది.