కటక్ : అల్టిమేట్ ఖోఖో లీగ్ రెండో సీజన్లో తెలుగు యోధాస్కు తొలి ఓటమి ఎదురైంది. సోమవారం జరిగిన తమ రెండో మ్యాచ్లో యోధాస్ 32–38తో చెన్నై క్విక్ గన్స్ చేతిలో పోరాడి ఓడిపోయింది.
చెన్నై ఆటగాడు రాంజీ 14 పాయింట్లతో సత్తా చాటాడు. మూడు స్కై డైవ్స్ సహా డిఫెన్స్లో 2.43 నిమిషాల డ్రీమ్ రన్ చేశాడు. వాజిర్ 10 పాయింట్లతో రాణించాడు. మరో మ్యాచ్లో గుజరాత్ 41–30తో రాజస్తాన్ వారియర్స్పై గెలిచింది.