
కటక్ : అల్టిమేట్ ఖో ఖో లీగ్లో తెలుగు యోధాస్ వరుసగా రెండో సీజన్లోనూ సెమీఫైనల్ చేరుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో యోధాస్ 38–30తో చెన్నై క్విక్ గన్స్ను ఓడించి అందరికంటే ముందే సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్లో రాహుల్ మండల్ 10 పాయింట్లతో తెలుగు టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.