
కటక్ : అల్టిమేట్ ఖో ఖో లీగ్లో తెలుగు యోధాస్ టీమ్ సెమీస్తోనే సరిపెట్టుకుంది. గురువారం జరిగిన నాకౌట్ మ్యాచ్లో చెన్నై క్విక్గన్స్ 31–29తో యోధాస్ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. దీంతో రెండోసారి టైటిల్ ఫైట్కు అర్హత సాధించాలనుకున్న తెలుగు టీమ్ ఆశలు ఫలించలేదు. యోధాస్ ప్లేయర్లు 12 టచ్, 8 పోల్ డైవ్, 6 స్కై డైవ్, 3 బ్యాచ్ బోనస్ పాయింట్లు సాధించగా, చెన్నై టీమ్ 18 స్కై డైవ్ పాయింట్లతో చెలరేగింది.
పోల్ డైవ్ (4), టచ్ (4)లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే 5 బోనస్ పాయింట్లు సాధించి మ్యాచ్ను సొంతం చేసుకుంది. మరో సెమీస్లో గుజరాత్ జెయింట్స్ 29–27తో ఒడిశా జాగర్నాట్స్పై నెగ్గి టైటిల్ ఫైట్కు అర్హత సాధించింది. మూడో ప్లేస్ కోసం శనివారం జరిగే మ్యాచ్లో తెలుగు యోధాస్.. ఒడిశాతో తలపడుతుంది.