కటక్ : అల్టిమేట్ ఖో ఖో లీగ్లో తెలుగు యోధాస్ నాలుగో విజయం సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్లో యోధాస్ 34–27తో రాజస్తాన్ వారియన్స్ను ఓడించింది. తెలుగు టీమ్లో కెప్టెన్ ప్రతీక్ అత్యధికంగా 8 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ఎటాకింగ్లో ఆదిత్య, రాహుల్ మండల్ కలిసి 12 పాయింట్లు రాబట్టారు.
ఆదిత్య, ఆకాశ్ 4 నిమిషాలు మ్యాట్పై నిలిచి డ్రీమ్ రన్తో జట్టుకు బోనస్ పాయింట్ అందించారు. అంతకుముందు మరో మ్యాచ్లో చెన్నై క్విక్ గన్స్ 35–29తో గుజరాత్ జెయింట్స్కు తొలి ఓటమి రుచి చూపెట్టింది.