
కటక్: అల్టిమేట్ ఖో ఖో లీగ్లో తెలుగు యోధాస్కు రెండో ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 41–24తో తెలుగు యోధాస్పై నెగ్గింది. స్కై డైవ్లో 8, టచ్లో 8 పాయింట్లు సాధించిన తెలుగు టీమ్ పోల్ డైవ్స్ (6) లో నిరాశపర్చింది.
12 డైవ్ పాయింట్స్, 8 పోల్ డైవ్ పాయింట్స్, 16 టచ్ పాయింట్లతో గుజరాత్ ఆధిపత్యం చూపెట్టింది. 5 బోనస్ పాయింట్లతో ఈజీగా మ్యాచ్ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్లో చెన్నై క్విక్గన్స్ 31–27తో రాజస్తాన్ వారియర్స్ను ఓడించింది.