ఆదిలాబాద్​లో 45 డిగ్రీలు 

   ఆదిలాబాద్​లో 45 డిగ్రీలు 
  • పెరుగుతున్న వడదెబ్బ మరణాలు
  • ఈ నెలలో 15 మందికి పైగా మృతి

వెలుగు, నెట్ వర్క్​: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. చాలా చోట్ల 40 డిగ్రీల కన్నా అధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరిగిపోతుండటంతో జనాలు ఇండ్ల నుంచి  బయటకు రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 3 వరకు హైదరాబాద్​ సహా పట్టణాలు, గ్రామాల్లో  రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. 

ఉపాధి హామీ కూలీలు, ఫీల్డ్​వర్కర్లు, పశువుల కాపరులు మండే ఎండల్లో పని చేయడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈజీఎస్ పనులు చేస్తున్న దగ్గర నీడ, నీళ్ల ఏర్పాట్లు చేయకపోవడంతో ఉపాధి కూలీలు వడదెబ్బకు గురవుతున్నారు. ఏప్రిల్​లో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా15 మందికి పైగా వడదెబ్బతో చనిపోయారు. మంగళవారం కూడా రాష్ట్రమంతటా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్​లో 45 డిగ్రీలు రికార్డు కాగా, నిజామాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్​లలో 44 డిగ్రీలు,  నిర్మల్ జిల్లా కడెంలో 43, కరీంనగర్​ జిల్లా జమ్మికుంట, హుజూరాబాద్​లో, భద్రాద్రి జిల్లా మణుగూరులో  42 డిగ్రీలు, కొత్తగూడెంలో 41, నల్గొండలో కూడా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.

వడదెబ్బతో.. 

వడదెబ్బతో ఈ సీజన్​లో ఇప్పటివరకు 15 మందికి పైగా చనిపోయారు. నిజామాబాద్​ జిల్లాలో అత్యధికంగా ఆరుగురు మృతి చెందారు. మంచిర్యాల జిల్లాలో ముగ్గురు, ఆదిలాబాద్​లో ఇద్దరు, యాదాద్రి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. కుమ్రంభీమ్​ ఆసిఫాబాద్​ జిల్లా తిర్యాణిలో ఉపాధి హామీ పధకం టెక్నికల్​అసిస్టెంట్ సంపత్​ ఫీల్డ్​విజిట్​చేసి ఇంటికి వెళ్లగానే అస్వస్థతకు గురై చనిపోయాడు. నిర్మల్ జిల్లా లోని దిలావర్​పూర్ మండలం బన్సపల్లికి చెందిన ఉపాధి కూలీ పుండ్రు వనిత ఈనెల 18న చనిపోయింది. నాగర్​కర్నూలు జిల్లా పెంట్లవెల్లికి చెందిన రాముడు(35) ఈనెల 18న గొర్రెలు మేపడానికి వెళ్లి ఎండల వల్ల అస్వస్థతకు గురై మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపూర్ లో  ఉపాధి కూలీ మాదారపు సోమయ్య ఈ నెల 14న వడదెబ్బతో మరణించాడు. ఈజీఎస్​ పనులు జరుగుతున్న చోట నిబంధనల ప్రకారం నీడ, నీ