కుమ్రంభీంమ్ జిల్లా అసిఫాబాద్ మండలంలోని గుండివాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన చిన్నపాటి వర్షానికే కొట్టుకుపోయింది. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు ఆగిపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. 2006లోనే గుండి వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి... పనులు ప్రారంభించారు. 15యేళ్ళయినా బ్రిడ్జి పూర్తికాలేదు. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో... ఇప్పుడు 30కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని అంటున్నారు గ్రామస్థులు.
మరిన్ని వార్తల కోసం..