
- రాష్ట్రవ్యాప్తంగా యాదాద్రి జిల్లాలోనే తక్కువ ధర కోట్
- ఆ తర్వాత స్థానంలో ఖమ్మం
- ఎక్కువ రేటు గద్వాల, నారాయణపేట
- స్కూల్స్, కేజీబీవీ, హాస్టల్స్, గురుకులాల్లో సరఫరాకు టెండర్లు
యాదాద్రి, వెలుగు : అంగన్వాడీ సెంటర్లు, గురుకులాలు, హాస్టల్స్, కేజీబీవీలకు ప్రభుత్వం పంపిణీ చేసే కోడిగుడ్లకు సంబంధించిన టెండర్లలో యాదాద్రి జిల్లాలో తక్కువ రేట్కు కాంట్రాక్టర్బిడ్దాఖలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ నిర్వహించిన టెండర్లలో ఇదే తక్కువ రేటుగా నిలిచింది. ఖమ్మం తప్ప మిగతా జిల్లాలతో పోలిస్తే తక్కువకే కోట్చేశారు.
కొత్త జిల్లాల వారీగా ఒకే టెండర్..
గతంలో వేర్వేరు విధానాల్లో కాంట్రాక్టర్లు గుడ్లను సప్లయ్చేసేవారు. ఈ విధానానికి స్వస్తి చెప్పిన సర్కారు.. ఆయా విద్యా సంస్థలకు ఒకే కాంట్రాక్టర్, ఒకే విధమైన రేటుతో సప్లయ్చేసేలా నిర్ణయించింది. ఇందులో భాగంగానే కొత్త జిల్లాల వారీగా వేర్వేరుగా కోడిగుడ్ల సరఫరాకు టెండర్లు పిలిచారు. ఒక్కో గుడ్డు 45 గ్రాముల నుంచి 50 గ్రాముల సైజులో సప్లయ్చేయాలని టెండర్లో పేర్కొన్నారు.
ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికే..
రూల్స్ మేరకు టెండర్లలో ఎవరు తక్కువ రేటుకు సప్లయ్చేస్తారో వారికే దక్కుతుంది. ఈవిధంగా ఇప్పటివరకూ 21 జిల్లాల్లో కోడి గుడ్ల టెండర్ ప్రక్రియ ముగిసినట్టుగా తెలుస్తోంది. కోడి గుడ్ల సరఫరాకు బిడ్దాఖలు చేసిన కాంట్రాక్టర్లు ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా రేటును పేర్కొన్నారు. వీరిలో తక్కువ రేటు కోట్చేసిన వారు కోడి గుడ్ల సప్లయ్కాంట్రాక్ట్దక్కించుకున్నారు.
యాదాద్రిలో గుడ్డు రూ. 5.85..
తాజాగా ఈ ప్రక్రియ యాదాద్రి జిల్లాలో ముగిసింది. అన్ని జిల్లాల్లో పోలిస్తే యాదాద్రిలో కోట్చేసిన రేటు తక్కువగా ఉంది. జిల్లాలో ఐదుగురు కాంట్రాక్టర్లు రూ. 7 లక్షల చొప్పున ఈఎండీ చెల్లించి టెండర్లు దాఖలు చేశారు. అయితే వీరిలో ఓ కాంట్రాక్టర్రూల్స్మేరకు అవసరమైన డాక్యూమెంట్ దాఖలు చేయకపోవడంతో తిరస్కరించారు.
మిగిలిన నలుగురిలో ఇద్దరు ఒక్కో గుడ్డుకు రూ. 6.42 కోట్చేశారు. మరో వ్యక్తి రూ.6.36 కోట్చేశారు. అయితే ఒక్కో గుడ్డును రూ. 5.85 చొప్పున సప్లయ్ చేయడానికి ఖమ్మం జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ కోట్చేసి టెండర్దక్కించుకున్నారు. ఈ రేటుకే జిల్లాలోని 62, 400 మంది స్టూడెంట్స్కు 1,63,18,000 గుడ్లు సప్లయ్చేయాల్సి ఉంటుంది.