కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య తోపులాట

కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య తోపులాట

వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంఘర్షణ సభకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు వీసీ కార్యాలయం ముట్టడించేందుకు బయలు దేరారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా.. తప్పించుకుని వీసీ ఆఫీస్ బిల్డింకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలు చేశారు. ఈ క్రమంలోనే స్టూడెంట్స్, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులను పోలీసులు ఈడ్చి పడేశారు. దీంతో యూనివర్సిటీ మెయిన్ ఎంట్రెన్స్ వద్ద విద్యార్థులు కిటికీల అద్దాలు, పూల కుండీలు  పగులగొడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం వీసీ బిల్డింగ్ పైకి ఎక్కి ఇద్దరు స్టూడెంట్స్ నిరసన తెలిపారు. బలవంతంగా వారిని పోలీసులు కిందికి దించారు. అంతకుముందు పెట్రోలుతో టైర్లు కాలబెట్టే ప్రయత్నం చేయగా.. సీఐ దయాకర్ వారిని అడ్డుకున్నారు. ప్రస్తుతం కేయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇదిలా ఉండగా శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.