ఏపీలో రేపు టెన్త్ మార్కుల జాబితాలు ప్రకటన

ఏపీలో రేపు టెన్త్ మార్కుల జాబితాలు ప్రకటన

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి విద్యార్థుల మార్కుల జాబితాలను రేపు విడుదల చేయనున్నారు. కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకుండా ఫీజు కట్టినవారినందరినీ పాస్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. మెరిట్ విద్యార్థుల కోసం వారు కింది తరగతుల్లో సాధించిన మార్కుల ఆధారంగా పదో తరగతి మార్కులను నిర్ణయించారు. ఈ మార్కుల వివరాలను రేపు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు www.bse.ap.gov.in వెబ్ సైట్ లో ఉంచుతారు. 
సాయంత్రం నుంచి విద్యార్థులు తమ స్కూలు లాగిన్ వివరాలతో వెబ్ సైట్ నుంచి మార్కుల జాబితాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని హైస్కూళ్ల హెడ్మాస్టర్లు తమ విద్యార్థుల మార్కుల జాబితాలను డౌన్లోడ్ చేసి.. అటెస్ట్ చేసి విద్యార్థులకు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.