
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ పదో ఓటమిని మూటగట్టుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 26–46తో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడింది. టైటాన్స్ టీమ్లో రైడర్ పవన్ సెహ్రావత్ (11) మాత్రమే రాణించాడు. సందీప్ ధుల్ (4), మోహిత్ (2), నితిన్ (2)తో సహా అందరూ ఫెయిలయ్యారు. బెంగాల్ డిఫెండర్ వైభవ్ (9), రైడర్ నితిన్ కుమార్ (9), విశ్వాస్ (8), శుభమ్ షిండే (6) విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం టైటాన్స్ 9 పాయింట్లతో టేబుల్లో ఆఖరి ప్లేస్లో కొనసాగుతోంది.