చైతన్య రావు, అర్జున్ అంబటి హీరోలుగా ‘కొరమీను’ ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. రవి శంకర్ కీలక పాత్ర పోషించాడు. సతీష్ రాపోలు దర్శకత్వంలో నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 12న సినిమా విడుదల కానుంది.
ఇప్పటికే టీజర్తో ఆకట్టుకున్న టీమ్.. తాజాగా ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేశారు. పీఆర్ కంపోజ్ చేసిన పాటను పెంచల్ దాస్ స్వయంగా రాయడంతోపాటు తనే పాడాడు. ‘నా నల్లా కలువా పువ్వా.. ’ అంటూ ఎమోషనల్గా సాగిందీపాట. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నాం’ అని అన్నారు.