తెప్ప సముద్రం మూవీ ఏప్రిల్ 19న రిలీజ్

తెప్ప సముద్రం మూవీ ఏప్రిల్ 19న రిలీజ్

అర్జున్ అంబటి, ‘కొరమీను’  ఫేమ్ కిశోరి దాత్రక్ జంటగా నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. చైతన్య రావు,  రవి శంకర్ కీలక పాత్ర పోషించారు.  సతీష్ రాపోలు దర్శకత్వంలో నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్  నిర్మించారు. ఏప్రిల్ 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. 

ఇలాంటి చిన్న సినిమాలను ప్రతి ఒక్కరూ బతికించాలని కోరుతున్నానని అర్జున్ అంబటి అన్నాడు. తనకు చాలా స్పెషల్ మూవీ ఇదని చెప్పింది కిశోరి దాత్రక్. ‘చిన్నపిల్లల మీద జరిగే అఘాయిత్యాలను ఇందులో చూపిస్తున్నాం. అలాగే మంచి మెసేజ్ కూడా ఉంటుంది’ అని దర్శకుడు సతీష్ రాపోలు అన్నాడు. ప్రతి ఒక్కరికీ నచ్చేలా సినిమా ఉంటుందని నిర్మాత అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.