ఆగస్టులో టీఎఫ్‌‌‌‌సీసీ నంది అవార్డ్స్

ఆగస్టులో టీఎఫ్‌‌‌‌సీసీ నంది అవార్డ్స్

తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కామర్స్‌‌‌‌ ఆధ్వర్యంలో ‘టీఎఫ్‌‌‌‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ వేడుక‌‌‌‌లు దుబాయ్‌‌‌‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతాని రామ‌‌‌‌కృష్ణ గౌడ్‌‌‌‌. దీనికోసం 13 మంది జ్యూరీ సభ్యులను సెలెక్ట్ చేశారు.

ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌కి జ్యూరీ సభ్యులు బి. గోపాల్, మురళీ మోహన్, సుమన్, శివాజీ రాజా, రేలంగి నరసింహారావు, రోజారమణి తదితరులు హాజరై.. ఆగస్టు 12 న దుబాయ్‌‌‌‌లో జరిగే టీఎఫ్‌‌‌‌సీసీ నంది అవార్డ్స్ విజయవంతం కావాలని అన్నారు.

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘2021–22 సంవ‌‌‌‌త్సరంలో విడుద‌‌‌‌లైన చిత్రాల వాళ్లు  టీఎఫ్‌‌‌‌సీసీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో అప్లయ్ చేసుకోవ‌‌‌‌చ్చు. చివరి తేది జూన్ 15. తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్‌‌‌‌తో ఈ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహించబోతున్నాం’ అని అన్నారు.