జులై 21 నుంచి ఎడ్ సెట్ రిజిస్ట్రేషన్లు అడ్మిషన్ల షెడ్యూల్ రిలీజ్

జులై  21 నుంచి ఎడ్ సెట్ రిజిస్ట్రేషన్లు అడ్మిషన్ల షెడ్యూల్  రిలీజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం టీజీ ఎడ్ సెట్–2025 అడ్మిషన్​ రిలీజ్  అయింది. ఈ నెల21 నుంచి ఆన్ లైన్  రిజిస్ర్టేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. శుక్రవారం హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్  ఆఫీసులో చైర్మన్  ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన ఎడ్ సెట్  కమిటీ సమావేశమైంది. ఈ నెల 14న అడ్మిషన్  షెడ్యూల్​ నోటిఫికేషన్  ప్రకటించాలని నిర్ణయించారు. ఈ నెల 21 నుంచి 31 వరకూ ఆన్​ లైన్  రిజిస్ర్టేషన్లు, ఆన్ లైన్  ఫీజు చెల్లింపుతో పాటు సర్టిఫికేట్ల అప్​లోడ్ కు అవకాశం కల్పించారు. మరిన్ని వివరాలను http://edcetadm.tgche.ac.in వెబ్ సైట్​లో పెడ్తామని అధికారులు ప్రకటించారు. 

జులై 14న పీఈసెట్ అడ్మిషన్ నోటిఫికేషన్

ఈ నెల 14న బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం పీఈసెట్  నోటిఫికేషన్  రిలీజ్  కానుంది. శుక్రవారం టీజీసీహెచ్ఈ చైర్మన్  బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో పీఈసెట్ అడ్మిషన్  కమిటీ సమావేశం జరిగింది. ఈ నెల 23 నుంచి 29 వరకూ రిజిస్ర్టేషన్లు, ఫీజు చెల్లింపుల ప్రక్రియ ఉంటుంది. 31, ఆగస్టు 1న వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఆగస్టు 4న ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్  జరుగుతుంది.